-
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సూచించినట్లు తెలిసింది. -
నేషనల్ లవర్స్ డే : ఈ అందమైన జంటల్ని చూడండి (ఫోటోలు)
-
Tamilnadu : ధర్మపురిలో తెలుగు ఓటరు కీలకం
సాక్షి, చైన్నె: పర్యాటకంగానే కాకుండా మామిడి ఉత్పత్తికి ధర్మపురి ప్రసిద్ధి చెందింది. కావేరి నదీ తీరంలోని తీర్థాదీశ్వర ఆలయంలో రాముడు, హనుమంతుడు పూజలు చేసినట్టుగా ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించడం కోసం రాముడు ఓ జలపాతాన్ని ఇక్కడ సృష్టించినట్టుగా, దీనిని నేడు హనుమంత తీర్థంగా పేర్కొంటుంటారు. భారత నయాగారాగా పిలవబడే ‘హొగ్నేకల్’ జలపాతం కూడా ఇక్కడే ఉంది. ఈ ధర్మపురిలో లోక్ సభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకంగా 20శాతం ఓటర్లు తెలుగు మాట్లాడే వారు కావడంతో ఇక్కడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది. డీఎంకే డిపాజిట్ గల్లంతు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే హవా కొనసాగింది. అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ధర్మపురిలో ఆపార్టీ నేతృత్వంలోని కూటమికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సీటు ఇక్కడ గెలువలేదు. ఈ లోక్సభ పరిధిలో పాలక్కోడు, పెన్నాగరం, ధర్మపురి, పాపిరెడ్డి పట్టి, హారూర్, మెట్టూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మేట్టూరు నియోజకవర్గం సేలం జిల్లాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో పాలక్కోడు నుంచి అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ ఐదోసారిగా గెలిచారు. అలాగే, అదే పార్టీకి చెందిన గోవిందస్వామి పాపిరెడ్డిపట్టి నుంచి, వి.సంపత్కుమార్ హారూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మూడు స్థానాలను అన్నాడీఎంకే కై వసం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాలలో పెన్నాగరం నుంచి పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, ధర్మపురి నుంచి పార్టీకి చెందిన ఎస్పీ వెంకటేశ్వరన్, మేట్టూరు నుంచి పి.సదాశివం విజయఢంకా మోగించారు. అన్నాడీఎంకే, పీఎంకే అభ్యర్థుల ముందు డీఎంకే కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందుకు డీఎంకే సిట్టింగ్ ఎంపీ డాక్టర్ ఎస్ సెంథిల్కుమార్ పనితీరు కారణంగా ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. చేజారకుండా జాగ్రత్తగా.. అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా లోక్సభ ఎన్నికలలో తమ పట్టు చేజారకుండా జాగ్రత్తగా వ్యూహాలకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదునుపెట్టారు. ఇక్కడ ఇప్పటి వరకు డీఎంకే 3 సార్లు, ఆ కూటమిలోని కాంగ్రెస్ మరో మూడుసార్లు గెలిచాయి. తమకు బలం ఉన్న చోట డిపాజిట్లు గల్లంతు కావడం ఆ కూటమిని జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఈసారి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి స్థానిక నేతగా ఉన్న ఎ.మణిని పోటీలో పెట్టారు. ఈయన గెలుపు లక్ష్యంగా సీఎం స్టాలిన్, యువజన నేత, మంత్రి ఉదయనిధిస్టాలిన్ ధర్మపురిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన ఓట్లను, పట్టును తిరిగి సొంతం చేసుకునేందుకు డీఎంకే కూటమిలోని పార్టీలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నాయి. పట్టు బిగిస్తామంటోన్న పీఎంకే.. ప్రస్తుతం డీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకుని తీరుతామన్న ధీమాను పీఎంకే, అన్నాడీఎంకేలు వేర్వేరుగా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు పీఎంకే నాలుగు సార్లు గెలిచింది. 2014లో ఆపార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలలో 70 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. గతంలో కంటే తమకు బలం పెరగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వ్యూహాత్మకంగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన వారసుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి అడుగులు వేశారు. తొలుత ఓ అభ్యర్థిని ప్రకటించినా, హఠాత్తుగా అతడ్ని మార్చి తన కోడలు సౌమ్య అన్బుమణిని అభ్యర్థిగా రాందాసు ప్రకటించారు. గతంలో అన్బుమణి ఎంపీగా ఉన్న సమయంల, ఆ తర్వాత కానీయండి తన నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ద్వారా సౌమ్య అన్బుమణి ఇక్కడి ప్రజలకే కాదు, తన సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణస్వామి కుమార్తెగా, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణిగా ప్రచారంలో సౌమ్య అన్బుమణి ముందంజలో ఉన్నారు. పీఎంకే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతున్నారు. పాగా వేస్తామంటున్న అన్నాడీఎంకే.. ఈ లోక్సభ నియోజకవర్గంలోని ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్థానికంగా బలం కలిగిన నేతలు. ఇందులో ఒకరు ఐదుసార్లు, మరో ఇద్దరు రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. తమకు బలం ఉన్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం కేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ అశోకన్ను గెలిపించేందుకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర సమరంలో తాము సైతం అంటూ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా డాక్టర్ అభినయ పొన్నివలవన్ సైతం ఓట్ల చీలికతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ ధర్మపురి లోక్సభను మళ్లీ కై వసం చేసుకోవడంమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. తమ గుప్పెట్లో నుంచి చేజారిన ఈ స్థానంపై పట్టుకు పీఎంకే తీవ్ర కుస్తీలు పడుతోంది. ఇక్కడ తమకు సైతం బలం ఉండడంతో పాగా వేసి తీరుతామన్న ధీమాను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేసులో తామూ ఉన్నామన్నట్టు నామ్ తమిళర్ కట్చి ప్రచారంలో ఉంది. వన్నియర్ సామాజిక వర్గం, తెలుగు మాట్లాడే వారే న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ లోక్సభలో ఓటరు నాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఓటరు ఎటో.. ఈ నియోజకవర్గంలో 15,12,732 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటే, ఈ నియోజకవర్గంలో మాత్రమే పురుషులు ఓట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఓటర్లలో వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ 50 శాతం, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 20%, ఇతర సామాజిక వర్గాలు 30 శాతం మేరకు ఉన్నాయి. ఈ ఓటరు నాడి ఎటో అనేది అంతు చిక్కని పరిస్థితి. 2019 లోక్సభ ఎన్నికలలో డీఎంకేను ఆదరించిన ఓటర్లు, 2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరస్కరించడం గమనార్హం. తాజాగా ఓటరు నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చెల్లా చెదురయ్యే అవకాశాల నేపథ్యంలో తెలుగు మాట్లాడే వారు, ఇతర సామాజిక వర్గాల ఓట్లే గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయనున్నాయి. దీంతో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నువ్వా..నేనా అంటూ అభ్యర్థులు ఉరకలు, పరుగులు తీస్తున్నారు. -
సిబ్లింగ్స్ డే: సెలబ్రెటీ సిబ్లింగ్స్..ఆ బంధం ఏం చెబుతోందంటే..!
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు/కూతురు ఉంటే హ్యాపీ అనుకుంటారు గానీ. అది అస్సలు నిజం కాదు. తమ్ముడో, చెల్లో ఉంటే ఆ దారే వేరు. ఆ బలమే వేరు. అలాంటి తోబుట్టువులకు సంబంధించిన ఒక రోజు ఉందని తెలుసా... ఈ బిజీ లైఫ్లో ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు బంధాలు ఉంటున్నాయి. అందుగురించే ఓ రోజుని ఏర్పాటు చేసి మనతో పాటు అమ్మ కడుపున పుట్టిన వాళ్లను అస్సలు విస్మరించొద్దు అని చెబుతున్నారు. దీన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ 10న తోబుట్టువుల దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీ తోబుట్టువులు జాబితా గురించి చర్చిద్దామా? రక్త సంబంధాలను ఎలా బలంగా పదిలపర్చుకోవాలో కూడా సవివరంగా తెలుసుకుందాం..! ఎంతటి వ్యక్తికైనా తన భాగస్వామి తోపాటు తోడబుట్టిన వాళ్లతో సత్సంబంధాలు బాగుండాలి. మన తోపాటు పుట్టిన వాళ్లని విస్మరించకూడదు. అంతెందుకు మన రామాయణంలో లక్ష్మణుడి కోసం రాముడు ఎంతగా పరితపిస్తాడో చక్కగా వివరించి ఉంటుంది. అందులో భార్య లేదా భర్త విధి వశాత్తు దూరమైతే మరొకరు ఆ స్థానం భర్తీ చేయగలరు గానీ మన తోడబుట్టినోడు దూరమైతే మరోకరు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఎంతో ఉద్విగ్నంగా రాసి ఉంటుంది. అంత గొప్ప రక్త సంబంధం అది. మృత్యువు తప్ప ఆ బంధాన్ని ఏదీ విడదీయలేదు అన్నంత దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన సినీ సెలబ్రెటీల తోబుట్టువులు ఒకరికొకరం అన్నంతగా ఉన్న వారెవరో చూద్దామా..! షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ ఇద్దరు స్టైలిష్ లుక్లో ఉండే సోదరులు ద్వయం. ఇరువు మధ్య మంచి అండర్స్టాండింగ్తో కూడిని బంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఉండే గౌరవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వీరి రిలేషన్ నుంచి తోబుట్టువని చిన్న చూపు కాకుండా గౌరవప్రదంగా చూసుకోవాలనే విషయం తెలుస్తుంది. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించాలంటే ముందు పెద్దవాళ్లే సరైన విధంగా ప్రవర్తించాలని చెబుతోంది. జాన్వీ కపూర్ -ఖుషీ కపూర్ టాలీవుడ్ అందాల రాశి దివంగంత నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. ఇద్దరూ అమ్మకు తగ్గ అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇరువురు మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. వారి తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడూ జాన్వీ తల్లిలా మారి తన చెల్లి ఖుషీకి ధైర్యం చెబుతూ మార్గ నిర్దేశించిన విధానం గురించి సోషల్ మీడియాల్లో విన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని లేదా ఇద్దర్ని కోల్పోయినప్పుడు మన తోడబుట్టిన వారికి ఎలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాలన్నది తెలియజేస్తుంది. అవసరమైతే తల్లిదండ్రులు రోల్ని తీసుకుని మరీ వారిపట్ల బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేబుతోంది. కరిష్మా కపూర్ -కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ నటుల అయిన ఈ సిస్టర్స్ ద్వయం ఎక్కడకు వెళ్లిన కలిసే వెళ్తుంటారు. కెరీర్ పరంగా మీడియా ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలు తెప్పించే ప్రయత్నం చేసినా..మాలో ఎవరికి స్టార్డమ్ వచ్చినా హ్యాపీనే అని హుందాగా చెప్పి ఆశ్చర్యపరిచిన పలు సందర్భాలు అనేకం. కష్టకాలంలో తోబుట్టువుకి ఎలా మద్దతు ఇవ్వాలన్నది కూడా వారిని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కేవలం సంతోషంగా ఉంటేనే తోబట్టువులు గుర్తు తెచ్చుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు తరచి తరచి వారి బాగోగులు తెలుసుకోవాలి, వారికి కావాల్సినంత అండ దండ ఇవ్వాల్సి కూడా ఉంటుందనే విషయం తప్పక గ్రహించాలి. సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అన్నా-చెల్లెలు అంటే ఇలా ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ల ద్వయంని చూస్తే తెలుస్తుంది. ఇద్దరు రాజకుటుంబానికి చెందిన వారి వల్లే మంచి అట్రాక్టివ్ లుక్లో కనిపిస్తారు. ఇరువురు స్నేహితులేమో అనుకునేలా ఉంటారు. చెబితేగాని తెలియదు అన్నాచెల్లెళ్లు అని. మన తోడబుట్టిన వాళ్లతో ఇంతలా సరదాగా ఓ స్నేహితుడితో ఉన్నంత చనువుగా ఉండాలని చెప్పకనే చెబుతోంది వీరి బంధం. కృతి సనన్- నూపూర్ సనన్ అక్కా చెల్లెళ్లు ఎలా ఉండాలనేందుకు ఈ ఇద్దరే ఆదర్శం. అక్కా చెల్లెళ్లు అనంగానే కాస్త రాగద్వేషాలు, అసూయలు రాజుకుంటాయి. అది అందం లేదా కెరీర్ పరంగానైనా ఉండొచ్చు. కానీ వీళ్ల మధ్య వాటికి స్థానం లేదు. ప్రేమగా మెలుగుతున్న వారిని చూస్తే ఎవ్వరికైన అసూయాగా అనిపిస్తుంది. అబ్బా నాకు ఓ అక్క లేదా చెల్లి ఉంటే బాగుండును అనిపిస్తుంది. తగాదాలకు తావివ్వకుండా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ మంచి సోదరీమణుల్లా మెలుగుతుంది ఈ సిస్టర్స్ ద్వయం. చివరిగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ ఈ ముగ్గురు అన్నదమ్ములు విచిత్ర సోదరులు సినిమాలోని సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికొకరు వెన్నుదన్నుగా ఉంటారు. వీరినుంచి ఐక్యమత్యంగా ఎలా ఉండాలనేది నేర్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే తోబుట్టువుల మధ్య ఉండాల్సింది ఐక్యమత్యమే!. (చదవండి: ప్రాన్స్తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..) -
టూత్పేస్ట్, చెప్పులు, బెలూన్.. స్వతంత్రులకు 190 ఎంపికలు!
దేశంలో ఎన్నికలు జరిగే సందర్భంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా వారి గుర్తులకు అత్యంత ప్రాధాన్యత ఉండటాన్ని మనం చూస్తుంటాం. అభ్యర్థులు కూడా ప్రచారంలో తమ ఎన్నికల గుర్తును చూపించి, దానికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతుంటారు. ఓటింగ్ సమయంలోనూ ఓటర్లు అభ్యర్థి పేరు కంటే వారి చిహ్నాన్ని గుర్తు పెట్టుకుంటారు. అన్ని పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఆయా ఎన్నికల చిహ్నాలను ఏ రాష్ట్రంలోనూ ఏ ఇతర పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. ప్రాంతీయ పార్టీలకు కూడా వేర్వేరు ఎన్నికల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతుంటారు. అలాంటి అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 190 గుర్తులను ఖరారు చేసింది. నామినేషన్లు సమర్పించేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కమిషన్ అందించిన జాబితాలోని ఏదో ఒక ఎన్నికల గుర్తును ఎంచుకుని దానిని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల గుర్తును కమిషన్ కేటాయిస్తుంది. దేశంలో ఆరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల చిహ్నాలలో పురాతన కాలం నుండి ఆధునిక కాలం నాటి అంశాల వరకు ఉన్నాయి. వీటిలో ఆహారం, రవాణా, దినచర్యలో ఉపయోగించే వస్తువులు, పరికరాలు మొదలైనవి ఉన్నాయి. మొబైల్, మొబైల్ ఛార్జర్తో పాటు టెలిఫోన్ కూడా ఎన్నికల చిహ్నంగా ఉంది. స్లేట్, ల్యాప్టాప్ కూడా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. -
భారత్లోకి అక్రమ చొరబాటు.. ఇద్దరు చైనా పౌరులు అరెస్ట్!
భారత సరిహద్దుల్లో చొరబాట్లకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. తాజాగా భారత్- నేపాల్ సరిహద్దు దగ్గర ఇద్దరు చొరబాటుదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లోని నేపాల్ సరిహద్దులో ఇద్దరు చైనా పౌరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారన్నారు. వీరిని గుర్తించిన భారత సైన్యం, సిద్ధార్థనగర్ పోలీసుల బృందం వారిని పట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఎస్బీ, సిద్ధార్థనగర్ పోలీసుల బృందం మార్చి 26న చైనాకు చెందిన ఓ పురుషునితో పాటు మహిళను అరెస్టు చేసింది. పోలీసు అధికారులు వారిని తనిఖీ చేశారు. వారి నుంచి రెండు చైనీస్ పాస్పోర్ట్లు, నేపాల్కు చెందిన టూరిస్ట్ వీసా, రెండు మొబైల్ ఫోన్లు, రెండు నేపాలీ సిమ్ కార్డులు, రెండు చైనీస్ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిద్ధార్థనగర్ ఏఎస్పీ సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. భారత్- నేపాల్లు మొత్తం 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను పంచుకుంటాయి. ఈ సరిహద్దు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింల మీదుగా కొనసాగుతుంది. భారత్ ఈ సరిహద్దులో 455 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి, జస్టిస్ అనిల్కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్రావు, ఏఐఎఫ్టీపీ (సౌత్జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
ఒడిషా : పేరుకే సరస్సు, చిలికా చిక్కేదెలా..?
భువనేశ్వర్: రాష్ట్ర రాజకీయాల్లో చిలికా నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. చిలికా శాసనసభ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం కావడంతో విభిన్న ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాల్లో దీనిపై ఖుర్దా జిల్లా ప్రభావం అధికంగా ఉంటుంది. భౌగోళిక సరిహద్దుల ప్రకారం పూరీ జిల్లాలో ఉంది. అలాగే భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సరిహద్దు కావడంతో పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో విలీనమై కొనసాగుతోంది. ఈ శాసనసభ ప్రాతినిథ్యంలో ఖుర్దా జిల్లా పెత్తనం చలామణి అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రాబల్యం భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్లో ఉపకరిస్తుంది. సందిగ్ధంలో బీజేడీ గత ఎన్నికల్లో బిజూ జనతా దళ్ అభ్యర్థి ప్రశాంత జగదేవ్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన బీజేడీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనలో బీజేడీ తలమునకలైంది. దీనిలో భాగంగా ఈసారి చిలికా నియోజకవర్గం నుంచి డాక్టర్ ప్రసన్న కుమార్ పటసహాణిని దించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ యోచనతో ప్రసన్న కుమార్ పాత్ర మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. ఆయన బిజూ జనతా దళ్లో విద్యాధికుడు, ఆసు కవి, ఓటరుని ఇట్టే ఆకట్టుకోగలిగే చమత్కారిగా పేరొందారు. అధిష్టానం నిర్ణయంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల పోరు నుంచి దూరమై విధేయుడుగా మిగిలిపోయారు. అయితే ప్రస్తుత అనిశ్చితి వాతావరణాన్ని అవలీలగా ఎదుర్కోగలిగే దక్షత ఆయనకే ఉందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ పటసహాణి మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు పునః రంగ ప్రవేశం చేయడం తథ్యం. చిలికా నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్ర శాసనసభకు ఇదివరకే వరుసగా 4 సార్లు ఎన్నికై చరిత్రని సృష్టించారు. బీజేపీతో సరితూగునా..? చిలికా నియోజకవర్గంపై భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా గట్టిపట్టు ఉంది. దీర్ఘకాలంగా తెరమరుగైన పటసహాణి చతురత బీజేపీతో తలపడేందుకు ఎంతవరకు దోహదపడుతుందోననే విశ్లేషణతో ఉభయ పార్టీల అధిష్టానాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో హరిచందన్ కుటుంబీకులకు గట్టిపట్టు ఉంది. సమగ్రంగా చిలికా శాసనసభ నియోజకవర్గంలో బీజేడీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. డాక్టర్ బిభూతి భూషణ్ హరిచందన్ చాలాసార్లు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ హరిచందన్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. తొలి సమావేశంలో పటసహాణి అభ్యర్థుల ఖరారు, సీట్ల కేటాయింపు వ్యవహారం పురస్కరించుకుని నవీన్ నివాస్లో జరిగిన తొలి సమావేశంలో పూరీ పార్లమెంటరీ స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశానికి బీజేడీ అగ్రస్థాయి నాయకులతో పూరీ జిల్లా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో డాక్టర్ ప్రసన్న కుమార్ పటసహాణి కూడా హాజరు కావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం ఆయన స్పందిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి విధేయునిగా కొనసాగుతానని ప్రకటించారు. పొత్తు కుదిరితే.. బీజేడీ, బీజేపీ ఎన్నికల పొత్తు కుదిరితే చిలికా నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ మంతనాలు జరుపుతోంది. పోటీని ఎదుర్కోవడంలో సమర్ధవంతమైన అభ్యర్థి ఖరారు కాని పరిస్థితుల్లో, బీజేపీ యోచన ప్రకారం ఈ సీటుని అంకితం చేసి పోటీ నుంచి హుందాగా తప్పుకోవాలని బీజేడీ తన చాతుర్యానికి పదును పెడుతోంది. ప్రశాంత జగదేవ్ క్షేత్రస్థాయి రాజకీయం బీజేడీకి ప్రతికూల పరిస్థితుల్ని ప్రేరేపించే సందేహంతో పోటీ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా బీజేడీ అడుగులు వేస్తోంది. బీజేపీ మాత్రం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇటీవల పార్టీలో చేరిన ప్రశాంత జగదేవ్ని మాత్రం ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష పోటీకి బరిలోకి దింపకుండా, ఆయన బలాన్ని ప్రయోగించి నికరమైన విజయం కోసం పావులు కదుపుతోంది. -
మహారాష్ట్ర, అరుణాచల్లో భూకంపం.. భయంతో జనం పరుగులు!
మహారాష్ట్ర, అరుణాచల్లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
నేడు తెలంగాణకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది. బుధవారం మధ్యాహ్నం జలసౌధలో నీటి పారుదల శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలతో సమావేశం కానుంది. ఈ నెల 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తనిఖీలు నిర్వహించనుంది. మళ్లీ 9న హైదరాబాద్లో అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. అదేరోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనుంది. మరోవైపు బ్యారేజీల డిజైన్లు మొదలు నిర్మాణం వరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కమిటీ కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం అందించాలని లేఖ రాసింది. ఇదీ చదవండి: వీడ్కోలు సమయాన విన్నపాలు -
భారత్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాక్ యత్నం!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షాబాజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని ఈనెల 28న భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా నాలుగేళ్ల విరామం తర్వాత పాక్ తమ జాతీయ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. 1940లో లాహోర్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. దీనికి గుర్తుగా సాధారణంగా మార్చి 23న పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి దీనిని మార్చి 28న నిర్వహించేందు సన్నాహాలు చేస్తున్నారు. 1940, మార్చి 22 నుండి మార్చి 24 వరకు లాహోర్లో జరిగిన సమావేశాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్.. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో భారతదేశంలోని ముస్లింల కోసం అధికారికంగా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనలో ఎక్కడా ‘పాకిస్తాన్’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించిన తేదీని పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 మార్చి 23న పాక్ అధికారికంగా తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీంతో పాకిస్తాన్ డొమినియన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా మారింది. 1960- 1968 మధ్య కాలంలో ఈ తీర్మానం ఆమోదం పొందిన స్థలంలో మినార్-ఎ-పాకిస్తాన్ నిర్మితమయ్యింది. దీనిపై తీర్మానానికి సంబంధించిన వివరాలు చెక్కారు. పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ కాంప్లెక్స్లో మార్చి 28న జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ దౌత్యవేత్తలు, భారతీయులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించనున్నారు. అనంతరం పాకిస్తాన్ హైకమిషనర్, ముఖ్య అతిథి ప్రసంగాలు చేయనున్నారు. -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్లపై శ్రీరామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్పూల్తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
Corona: మళ్లీ కోవిడ్.. భయమెంతవరకు..?
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 16 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ (గురువారం) నమోదైన కేసుల సంఖ్య 1013 గా తెలుస్తోంది. గురువారం ఒక్కరోజులోనే 609 కేసులు నమోదైనట్లు సమాచారం. కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరణాలపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఇప్పటివరకూ చూస్తే,దేశంలో మొత్తంగా 3368 యాక్టివ్ కేసులు వున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని, కేసుల తీరును గమనిస్తే అత్యధిక కేసులు కర్ణాటకలో, అత్యల్పంగా ఉత్తరాఖండ్ లో నమోదై వున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 189, కేరళలో 154 కేసులు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ వైరస్ వ్యాప్తి మొదలైంది. ఈ జె.ఎన్ -1 వేరియంట్ ను 'వేరియంట్ అఫ్ ఇంట్రెస్ట్' ప్రపంచ ఆరోగ్య సంస్థగా (WHO) అభివర్ణిస్తోంది. ఈ వేరియంట్ లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ, ముప్పు శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య సంస్థ ధైర్యాన్ని అందిస్తోంది. అదే సమయంలో, రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేస్తోంది.జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) నెల రోజుల క్రితం దేశంలోని మూడు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాప్తిలో వుంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలకు పాకింది. దీనిని మనం గమనంలో ఉంచుకోవాలి. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే.గతంలో, కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం.ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, తగిన చర్యలు ప్రారంభించింది. కాకపోతే! చలికాలం,పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళ, కర్ణాటకలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇది మంచి పనే. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు.ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది.ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం! కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు.ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే, ప్రభుత్వం, నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు,సిబ్బంది కొరత లేకుండా చూడాలి.యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. ఐనా! యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది.అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం,భౌతిక దూరం పాటించడం,గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం,శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం,యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం,నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జాతికి జవాబు కావాలి!
దేశం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన అది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను బుధవారం టీవీల సాక్షిగా కళ్ళకు కట్టిన ఉదంతమది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు పదుల అడుగుల ఎత్తులోని లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీ పై నుంచి సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలు చేశారు. నలుగురినీ అరెస్ట్ చేసి, కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టి పోలీస్ కస్టడీకి పంపారు. సూత్రధారుల కోసం గాలింపు సాగుతోంది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు కానీ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇదేదో అప్పటికప్పుడు ఈ యువతీ యువకులు సృష్టించిన హంగామా కాదు. ఇరవై రెండేళ్ళ క్రితం పార్లమెంట్పై పాక్ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13నే... తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే ఎంత ఆలోచన, ప్రణాళిక ఉండివుంటుంది! ఒక్కపక్క అమెరికా గడ్డ మీద నుంచి హూంకరిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్వంత్ సింగ్ పన్నూ ఈ నెలాఖరులోగా పార్లమెంట్పై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించారు. మరోపక్క పార్లమెంట్పై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటనకు 22వ వార్షిక సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ వద్ద ఎంత పారాహుషార్గా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ కాలిజోళ్ళలో పొగగొట్టాలు పెట్టుకొని, లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా! ప్రాథమిక సమాచారం మేరకు... పార్లమెంట్లో అలజడి రేపిన నలుగురిలో ఎవరూ తీవ్ర వాదులు కారు. మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్ సింగ్ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల నుంచి ఫేస్బుక్ పేజీ ద్వారా ఎలా ఒక్కటయ్యారు, ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాలి. ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్ ఉద్యోగా నికి ‘నెట్’ సైతం పాసైన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్. కంప్యూటర్ ఇంజనీరైన నిరుద్యోగ మైసూరీ మధ్యవయస్కుడు మనోరంజన్. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన కుర్రాడు అమోల్. లక్నోకు చెందిన ఇ–రిక్షా కార్మికుడు సాగర్ శర్మ. ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరేపణతో చెడుదోవ పట్టి ఇంతటి దుస్సాహసానికి దిగినట్టు? వీరిని ఆడించిన అసలు నాయకుడు ఎవరు? ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న విదేశీ శక్తులా? ఏడాదిగా ఈ పథకరచన సాగుతోందట. ఈ మార్చి, జూలైల్లోనూ పార్లమెంట్లో భద్రతపై రెక్కీ నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తూ రాజకీయాలు రేగుతున్నాయి. అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. పార్లమెంట్ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే హోమ్ మంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని కోరుతున్నాయి. జవాబివ్వాల్సిన అధికార పక్షం మొండికేయడం, రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దీనికి పరాకాష్ఠ. సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండైన వారి పేర్లలో పేర్కొనడం విడ్డూరం. ఆ వాస్తవం రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్ మిస్టేక్’ అని సింపుల్గా తేల్చేస్తూ, 13మందే సస్పెండయ్యారని గురువారం పొద్దుపోయాక వివరణ నిచ్చుకోవాల్సి వచ్చింది. భద్రత విషయంలోనే కాదు... చివరకు సభా నిర్వహణలోనూ సర్కారీ నిర్లక్ష్యాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. నిరసన తెలిపే ప్రతిపక్షాలను పరోక్షంగా వెక్కిరిస్తూ, వచ్చి అరెస్టయినవారు ‘ఆందోళన్ జీవు’లంటూ అధి కారపక్షం తేలిగ్గా ముద్ర వేస్తోంది. ఒకవేళ వచ్చింది ‘ఆతంకవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక గ్రెనేడ్లు, ఐఈడీలు తేగలిగితేనో? ఏమై ఉండేది? భీతిగొలిపే ఆలోచన అది. అందుకే సర్వోన్నత పార్లమెంట్లోనే సభ్యుల రక్షణను వెక్కిరిస్తున్న ఘటనను ఆరోపణలపర్వంగా మారిస్తే లాభం లేదు. తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తోనూ పరిస్థితిని మదుపు చేయిస్తే, భద్రతా ఏర్పాట్లను పునస్సమీక్షిస్తే సభ్యులకు భరోసా కలుగుతుంది. దుర్భేద్యమని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులు మార్చాలి. మెటల్ డిటెక్టర్లతో ప్లాస్టిక్ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునికీకరించి, పటిష్ఠపరచాలి. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికీ వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయట. అదీ పట్టించుకోక కళ్ళు తెరిచి నిద్రపోతే నష్టం దేశానికి! అలాగే, ప్రభుత్వ గుర్తింపున్న పాత్రికేయుల్ని సైతం పార్లమెంట్లోకి రానివ్వని పాలకులు మహిళా రిజర్వేషన్ లాంటి కీలక బిల్లుల వేళ బస్సుల్లో జనాన్ని తరలించుకొచ్చి, గ్యాలరీ నుంచి నినాదాలిప్పిస్తున్న సంస్కృతిని విడ నాడాలి. పార్లమెంట్ ప్రాంగణం ప్రజాపాలనకై తప్ప, ప్రచార ఆర్భాటానికి కాదని గుర్తించాలి. మణి పూర్ మొదలు జాతీయ భద్రత దాకా ప్రతిదానిపైనా ప్రభుత్వ జవాబు కోసం, జవాబుదారీతనం కోసం ఇంతగా పట్టుబట్టాల్సి రావడం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదని గ్రహించాలి. -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్లో చైర్పర్సన్తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ను మినహాయించి మిగతా బ్రాంచ్లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి?
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. విద్యకుగల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశప్రజలంతా విద్యావంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే నవంబరు 11న(నేడు) జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం అక్షరాస్యత విషయంలో ఘనమైన చరిత్రను కలిగివుంది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పురాతన విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చాణక్య, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్, రామానుజన్, అమర్త్య సేన్ తదితర పండితులు, రచయితలు, కవులు, ఆలోచనాపరులను భారతదేశం ప్రపంచానికి అందించింది. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నవంబరు 11న దేశంలోని విద్యా సంస్థలు సెమినార్లు నిర్వహించడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. అక్షరాస్యత ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్వతంత్ర భారతావనిలో విద్యావ్యవస్థకు పునాదులు పడటం మొదలుకొని, ఈ రంగంలో నేడున్న స్థితిగతులు.. ఇందుకు నాటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ అందించిన సహకారాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వాస్తవాలు ప్రపంచంలోని 135 దేశాలలో మహిళల అక్షరాస్యత రేటులో భారతదేశం 123వ స్థానంలో ఉంది. దేశంలో 60 లక్షల మంది పిల్లలు బడి బయట అంటే చదవుకు దూరంగా ఉన్నారు. దేశంలో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. దేశంలో వయోజన అక్షరాస్యత రేటు 63%. ప్రపంచంలో అత్యధికంగా 287 మిలియన్ల(ఒక మిలియన్ అంటే 10 లక్షలు) నిరక్షరాస్యులైన వయోజనులకు నిలయంగా భారతదేశం ఉంది భారతదేశంలో బడి బయట ఉన్న పిల్లల్లో 47.78% మంది బాలికలే కావడం విశేషం. 1950లలో 10 మంది భారతీయుల్లో కేవలం ఇద్దరు మాత్రమే అక్షరాస్యులు. 2022నాటి విద్యా గణాంకాలు దేశంలో విద్యాభివృద్ధికి సూచికగా నిలిచాయి. 2018లో దేశంలో అక్షరాస్యత రేటు 74.4%కి చేరింది. దీనిని చూస్తే దేశంలో అక్షరాస్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది. దేశంలో అక్షరాస్యత రేటు లింగం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను అనుసరించి మారుతుంటుంది. 2018 నాటికి పురుషుల అక్షరాస్యత రేటు 82.4శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 65.8శాతం. అక్షరాస్యత రేటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విభిన్నంగా కనిపిస్తుంది. కేరళలో అక్షరాస్యత రేటు 96.2 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదయ్యింది. ఇది 66.4శాతంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, సామాజిక ఉద్యమాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి తదితరాలతో దేశంలో అక్షరాస్యత రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో అక్షరాస్యత శాతం పెరిగేందుకు దోహదపడిన ప్రభుత్వ కార్యక్రమాలిలా ఉన్నాయి. జాతీయ అక్షరాస్యత మిషన్: ఇది 1988లో ప్రారంభమయ్యింది. ఇది వయోజనులకు ప్రాథమిక విద్యను అందించడం, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తోంది. సర్వశిక్షా అభియాన్: 2001లో ప్రారంభమయ్యింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విద్యా హక్కు చట్టం: దీనిని 2009లో రూపొందించారు. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత , నిర్బంధ విద్యను తప్పనిసరి చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్: 2009లో ప్రారంభమయ్యింది. ఇది 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మాధ్యమిక విద్యను అందించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్: 2015లో ఇది ప్రారంభమయ్యింది. ఇంటర్నెట్ ద్వారా దేశ పౌరులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విద్యావిధానం ప్రారంభమయ్యింది. అక్షరాస్యతాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు దేశఅక్షరాస్యతలో లింగ అంతరం కనిపిస్తోంది. ఇది బాలికలు, మహిళలు విద్య, సాధికారతను పొందకుండా అడ్డుపడుతోంది. ఈ అంతరానికి పలు సామాజిక నమ్మకాలు, ఆచారాలు కారణంగా నిలుస్తున్నాయి. అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానత.. ఇది వివిధ రాష్ట్రాలు-ప్రాంతాల మధ్య వనరులు, అవకాశాల అసమాన పంపిణీని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్లో ఈ సవాళ్లు అధిగమించి భారత్ అక్షరాస్యత విషయంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం! ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్కార్డ్లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
జూబ్లీహిల్స్ బరిలో కరాటే క్వీన్?
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని జాతీయ కరాటే చాంపియన్ను సాధించిన సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. మూడేళ్ల క్రితమే సయ్యదా ఫలక్ మజ్లిస్ పారీ్టలో చేరారు. పార్లమెంట్లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడు’ అంటూ కొనియాడి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్తో దేవబంద్, ఢిల్లీ, షాహీన్న్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఫలక్ అభ్యరి్థత్వం వైపు మజ్లిస్ మొగ్గు చూపి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. -
సంక్షోభం అంచున పాక్.. ఇంధన లేమితో 48 విమానాలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. తాజాగా ఇంధనం లేని కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇంధనం పరిమితంగా ఉండటం వల్ల విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, కొన్ని విమాన సర్వీసులను రీషెడ్యూల్ కూడా చేశామని పీఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 13 దేశీ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే 12 విమానాలను షెడ్యూల్ మార్చామని అన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణీకులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్ను సంప్రదించాలని కోరారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశామని, మరోకొన్ని ఆలస్యం కానున్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వ చమురు సంస్థ (PSO) పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తినట్లు సమాచారం. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. మరోవైపు రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో పీఐఏను ప్రైవేట్ పరం చేసేందుకూ ఆలోచనలు నడుస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు రోజూ వారి ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల పాయం అందించాలని పీఐఏ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇటీవలే కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. PSO నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెంట్లు మాత్రమే అని పీఎస్ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పీఐఏ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోగా.. ప్రజలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదీ చదవండి: దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్ -
కేరళలో దాండియా నృత్యం.. శశి థరూర్ పోస్ట్ వైరల్!
ప్రస్తుతం ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను చాలా భిన్నమైన పద్ధతుల్లో చేసుకుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు సైతం దాండియాను ఎంతో సంతోషంగా ఆడుతూ నవరాత్ర ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. 'అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టెల్లో దాండియా నృత్యం' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Attention Gujarati sisters! This Navaratri, check out dandiya Kerala style! pic.twitter.com/tjNcmNd7oN — Shashi Tharoor (@ShashiTharoor) October 16, 2023 -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్వర్క్ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్లైన్ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్నగర్ రైల్వేలైన్లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement